ఆంధప్రదేశ్‌ ఐసెట్‌ (ICET) - 2021 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాల్లో 34,789 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణతా శాతం 91.27గా ఉంది. శ్రీకాకుళానికి చెందిన ఎం.రామకృష్ణ ఐసెట్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నారు. రెండో ర్యాంకును అనంతపురానికి చెందిన బండి లోకేష్ సాధించారు.

ఏపీ ఐసెట్ ఫలితాల్లో అబ్బాయిలు దూసుకెళ్లారు. టాప్ 10 ర్యాంకుల్లో 8 సొంతం చేసుకున్నారు. టాప్ 10లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వైష్ణవి 6వ ర్యాంకు.. చందన 10వ ర్యాంకు సాధించారు.

ఐసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

టాప్ 10 ర్యాంకర్ల వివరాలు.. 

ర్యాంకు విద్యార్థి పేరు జిల్లా  మార్కులు
1ఎం. రామకృష్ణ శ్రీకాకుళం 154.66
2బండి చంద్రశేఖర్  అనంతపూర్153.36
3టి. వెంకటేష్  విజయనగరం151.38
4అల్లి లిఖిత్ చిత్తూరు150.43
5షేక్ సమీయుల్లా చిత్తూరు149.74
6చిన్నం మణికంఠ కుమార్ గుంటూరు148.08
7ఈ. వైష్ణవి చిత్తూరు148.02
8సందు సోమశేఖర్ ప్రకాశం147.85 
9బేతి సాయి ఫణి సురేంద్రవిశాఖపట్నం147.24
10కరణం చందనచిత్తూరు146.84

Also Read: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..

Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి