Acid Attack:


ప్రియుడిపై యాసిడ్ దాడి..


బిహార్‌లోని పట్నాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియురాలు ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి ముఖం తీవ్రంగా కాలిపోయింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మొత్తం ఇద్దరు కలిసి ఈ దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సిమర్‌వాదా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. తెల్లవారుజామున ఇద్దరు ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు. బాధితుడి పేరు ధర్మేంద్ర కుమార్‌గా వెల్లడించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ధర్మేంద్రను ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 5 నెలలుగా ధర్మేంద్ర, సరిత కుమారి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తెల్లవారు జామున 2 గంటలకు సరిత..ధర్మేంద్రకి కాల్ చేసి కలవాలని చెప్పింది. ఆమెని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రియురాలితో పాటు మరో వ్యక్తి ముఖంపై యాసిడ్ పోశారు. ఆ మంట తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


"ధర్మేంద్ర ఆమెని కలవడానికి ఇంటికి వెళ్లాడు. కలిసి తిరిగి బయటకు వస్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి వచ్చి యాసిడ్‌ దాడి చేశారు. కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు"


- పోలీసులు


5 నెలలుగా పరిచయం..


5 నెలలుగా ఆ మహిళతో తనకు పరిచయం ఉన్నట్టు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ మహిళకు ఇప్పటికే పెళ్లైందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. భర్తతో వేరుగా ఉంటోందని వివరించాడు. పెళ్లి చేసుకోవాలని చాలా రోజులుగా ఆమె ఒత్తిడి చేస్తోందని, కానీ తనకు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని తెలిపాడు. ఈ విషయంలోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ముఖంపై యాసిడ్ పోసింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. 


Also Read: ఫ్రెండ్‌తో ఆ పని చేయాలంటూ టార్చర్ చేసిన భర్త, ఒప్పుకోలేదని బెల్ట్‌తో చికతబాది