Vizag honey trap case became a hot topic : అందమైన మహిళ. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ వీడియోలు తీస్తుంది. ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది. కొందరితో పరిచయాలు పెంచుకుంటుంది. వారితో సన్నిహితంగా మెలిగి వీడియో తీసుకుని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. ఆమె వలలో పడిన ప్రముఖులంతా కోట్లకు కోట్లు సమర్పించుకుంటారు. ఎందుకంటే.. అటు పోలీసులకు చెప్పుకోలేరు.. లఇటు డబ్బులు ఇవ్వకుండ ఆపలేరు. ఎందుకంటే వారు ప్రముఖులు మరి. వారి పరిస్థితిని ప్రత్యేకంగా అర్థం చేసుకున్న జాయ్ అనే మహిళ ఇదే ప్లాన్ పక్కాగా అమలు చేసింది.  ఎంత మంది ప్రముఖులని నిండా ముంచిందో కానీ.. ఇద్దరు భరించలేక పోలీసుల్ని ఆశ్రయించారు. 


పోలీసులు సీక్రెట్‌గా జరిగిన ఓ ఆపరేషన్ లో జాయ్ జెమీమా అనే మహిళను అరెస్టు చేశారు. ఆ అరెస్టు గురించిన  వివరాలను విశాఖ సీపీ శంఖబ్రద బాగ్చీ మీడియాకు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ముందుగా అందమైన అమ్మాయిల వీడియోలను అప్ లోడ్ చేస్తారు. వాటిని  విస్తృతంగా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆ అమ్మాయిలను హై ఫై పార్టీలకు, హోటళ్లకు పంపుతారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలతో పాటు బాగా డబ్బు ఉండి పలుకుబడి ఉన్న వారిని మాటల్లోకి దింపుతారు. మెల్లగా హనీ ట్రాప్ వేస్తారు.             


వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్


హోటల్‌లో కలుద్దామని చెప్పి.. పిలిచిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి ఎవరికీ తెలియకుండా  హోటల్‌కు వస్తాడు. ముందుగా డ్రింక్స్ చేద్దామని చెప్పి ఆ మహిళ మత్తు మందు కలిపిన మద్యం ఇస్తుంది. అది తాగా ఆ వ్యక్తి పడిపోతే.. వెంటనే.. న్యూడ్ గా మార్చేసి ఫోటోలు, వీడియోలు తీసుకుని మాయమైపోతారు. రెండు, మూడు రోజుల తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది . శాంపిల్ ఫోటోలు వీడియోలు సెండ్ చేసి.. బయటపడకుండా ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారు కావడంతో అవి బయటపడితే పరువు పోతుందని డబ్బులు సమర్పించుకుటూ ఉంటారు. చివరికి ఈ వేధింపులు భరించలేని వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి జాయ్ అనే మహిళ ఇందులో కీలకంగా ఉందని  గుర్తించి అరెస్టు చేశారు.                 



Also Read: Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!