Visakha Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలు తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమెపై బ్లేడుతో దాడి చేశారు. ఆమె కంఠంకోశాడు. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరిలంచారు. అలాగే పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


విశాఖపట్నంలోని నెహ్రు నగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల లలిత శ్రీ, 26 ఏళ్ల రామారావు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో లలిత శ్రీ రామారావును పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయమై పది రోజుల క్రితం ఇరు పక్షాల పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. రామారావుతో పెళ్లికి లలిత శ్రీ ససేమిరా అనడంతో రామారావు మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లలిత శ్రీ మేడపైన వాకింగ్ చేస్తుండగా.. రామారావు ఆమె వద్దకు వెళ్లాడు. పెళ్లి చేసుకోమని ప్రాధేయ పడ్డాడు. అమ్మాయి ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు.. తనను పెళ్లి చేసుకోకపోతే బ్లేడుతో కోసుకొని చనిపోతానని బెదిరించాడు. అప్పటికీ అమ్మాయి స్పందించకపోవడంతో రామారావు తీవ్ర ఆగ్రహానికి గురయ్యయాడు. 


ఈక్రమంలోనే రామారావు తన వెంట తెచ్చుకున్న లలిత శ్రీ కంఠంపై బ్లేడుతో కోశాడు. దీంతో ఆమె కు తీవ్ర రక్తస్రావమై పడిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు రామారావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే లలిత శ్రీ కంఠంపై 12 కుట్లు పడ్డాయని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.