Karnataka News: ఈ మధ్య కాలంలో నేరాలు చేసేవారు టెక్నాలజీని, తెలివితేటల్ని తెగ వాడేస్తున్నారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు కూడా తెగ కష్టపడాల్సి వస్తుంది. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. టాయిలెట్‌లో ఓ రహస్య గది ఏర్పాటు చేసుకుని వ్యభిచారం సాగిస్తోన్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అయితే ఈ ముఠా పట్టుబడటానికి కారణమేంటో తెలుసా? గురక.. అవును మీరు చదివింది నిజమే. అసలు ఏం జరిగిందంటే?


ఇదేం ఐడియారా బాబు!


కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్ర‌దుర్గ‌లోని ఓ చోట వ్య‌భిచారం చేస్తున్న‌ట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో హోటల్ మొత్తం జల్లెడ పట్టినా పోలీసులకు ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు గదులతో పాటు బాత్‌రూంలను కూడా పరిశీలించారు. అక్కడే అసలు విషయం బయటపడింది. బాత్రూంను పరిశీలిస్తోన్న సమంయలో అక్కడ నుంచి ఓ గురక శబ్దం వినిపించింది. 


దీంతో పోలీసులు శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించారు. టైల్స్‌ నుంచి గురక రావడం వినిపించి.. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది.




లోపలే వ్యభిచారం


పోలీసులు గదిని తెరిచి చూడగా అందులో ఒక చిన్న సెల్లార్ ఉండటం గుర్తించారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ ఇందులో పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం పోలీసులనే షాక్‌కు గురయ్యేలా చేసింది. పోలీసులు తీసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 



Also Read: Param Vishisht Seva Medal: ఆర్మీ చీఫ్‌కు రాష్ట్రపతి చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పురస్కారం


Also Read: SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్