Odisha Crime:


ఒడిశాలో దారుణం..


ఒడిశాలో ఓ వ్యక్తి భార్య, కూతురుని చంపేందుకు వాళ్ల గదిలోకి విషసర్పాన్ని పంపాడు. గంజం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆ పాము ఇద్దరినీ కాటు వేయడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. నెలన్నర క్రితం ఇది జరగ్గా ఇప్పుడు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. 2020లో వీళ్లకి పెళ్లైంది. ప్రస్తుతం రెండున్నరేళ్ల పాప ఉంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య గొడవలు బాగా పెరిగాయి. ఈ కోపంతో ఎలాగైనా భార్యని చంపాలని ప్లాన్ చేశాడు. పాములు ఆడించే వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. తాంత్రిక పూజలు చేస్తున్నానని, అందుకు ఓ పాము కావాలని అబద్ధం చెప్పి తీసుకున్నాడు. అక్టోబర్ 6వ తేదీన విషసర్పమైన కోబ్రాని ఓ ప్లాస్టిక్ జార్‌లో పెట్టాడు. భార్య,కూతురు నిద్రిస్తున్న గదిలోకి విడిచి పెట్టాడు. తెల్లారేసరికి ఇద్దరూ పాము కాటుకి బలి అయ్యారు. నిందితుడు మాత్రం వేరే గదిలో పడుకున్నాడు. అయితే..పోలీసులు ముందు ఇది అసహజ మరణం అని కేసు నమోదు చేసుకున్నారు. అయితే...మృతురాలి తండ్రి ఇది హత్య అయ్యుండొచ్చని కేసు పెట్టాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని బయటకు లాగారు. ఆధారాలు సేకరించడంలో ఆలస్యం జరగడం వల్ల నిందితుడిని ఆలస్యంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. 


"ఈ ఘటన జరిగి నెల రోజులైంది. ఇది హత్యే అని తేల్చడానికి ఇన్ని రోజులు పట్టింది. నిందితుడికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించాం. విచారణ చేపడుతున్న సమయంలో ముందు ఈ ఆరోపణల్ని నిందితుడు ఒప్పుకోలేదు. పాము గదిలోకి వచ్చి ఉండొచ్చని బుకాయించాడు. ఆ తరవాత నేరాన్ని అంగీకరించాడు"


- పోలీసులు 


 ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. T&C Apply