ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘనట విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబంలోని 4గురు వ్యక్తులు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య పాల్పడ్డారు.  అనంతరం కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నిజామాబాద్ జిల్లా అచన్ పల్లి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. మృతులను పప్పుల సురేష్ (46) ,శ్రీలత (42) దంపతులతో పాటు కొడుకు అఖిల్ (26),ఆశిష్ (22)లుగా గుర్తించారు.


కృష్ణా నదిలో గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టి వెలికి తీశారు. సురేష్ కుటుంబం ఆత్మహత్యకు వ్యాపారంలో నష్టాలు, అప్పులు కారణం అని సమాచారం. బెజవాడలో నిజామాబాద్ వాసుల ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. నలుగురు కుటుంబ సభ్యుల మరణంతో నిజామాబాద్ లో కలకలం రేగింది.


రెండు రోజుల క్రితం విజయవాడకు...


విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనానికి పప్పుల సురేష్ కుటుంబం రెండు రోజుల క్రితం వెళ్లినట్టు తెలిసింది. శుక్రవారం సురేష్ ఇంటిని తనఖా కింద సీజ్ చేయడానికి నోటీసులు ఇంటికి అతికించినట్టు సమాచారం. శనివారం సురేష్ తన బావమరిదికి ఫోన్ చేసి తాము అప్పుల ఊబిలో కురుకుపోయామని, తాము చనిపోతున్నామని ఫోన్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అతని బావమరిది విజయవాడ పోలీస్ లకు సమాచారం ఇచ్చే సరికి శ్రీలత,ఆశిష్ లు సత్రంలో విషం తాగి, సురేష్, అఖిల్ లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


Also Read: Nizamsagar: ప్రభుత్వ పథకాలు కావాలంటే నా కోరిక తీర్చాలి... వెలుగులోకి మరో కాలకేయుడి ఆగడాలు


Also Read: Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి


Also Read: Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు... మరో చోటుకు మకాం మార్చుతుంటే అదుపులోకి తీసుకున్న పోలీసులు


Also Read: Vanama Raghava Case: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్‌


Also Read: కామారెడ్డి జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ కేసులు


Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి