Delhi Crime News


ఢిల్లీలో హత్య..


దేశ రాజధాని ఢిల్లీ ఒళ్లు జలదరించే క్రైమ్ జరిగింది. గీతా కాలనీలోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ శరీర భాగాలు కనిపించడం సంచలనమైంది. శ్రద్ధా వాకర్‌ దారుణంగా హత్య చేసిన కేసు నుంచే ఇంకా కోలుకోక ముందే దాదాపు అలాంటి నేరమే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్‌ దగ్గర్లో పడేశారు దుండగులు. ఇవాళ ఉదయం (జులై 12) 9 గంటలకు పోలీసులకు ఈ సమాచారం అందింది. శరీర భాగాలు ఒక్కోటి ఒక్కో చోట పడేసి ఉన్నాయి. ఆమె తలని స్వాధీనం చేసుకున్నారు. మిగతా శరీర భాగాల కోసం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తరహా నేరాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. హత్య చేయడమే కాకుండా బాడీని ముక్కలుగా నరికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా నేరస్థులు ఇలా జాగ్రత్త పడుతున్నారు. ఈ కేస్‌లను డీల్ చేయడంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో రెండు ప్లాస్టిక్ బ్యాగ్‌లు దొరికాయని పోలీసులు వెల్లడించారు. 


"రెండు  బ్లాక్ పాలిథీన్ బ్యాగ్‌లు కనిపించాయి. ఓ బ్యాగ్‌లో మహిళ తల ఉంది. మరో సంచిలో మిగతా శరీర భాగాలున్నాయి. జుట్టు చాలా పొడవుగా ఉండడం వల్ల చనిపోయింది మహిళే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. మహిళా కాదా అన్నది పూర్తి విచారణ తరవాతే తెలుస్తుంది"


- పోలీసులు