Severe Road Accident In Kothur: మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. టెంపో, ఆటో, బైక్‌ను ఢీకొని ఏడాది చిన్నారి సహా తల్లి మృతికి కారణమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుగ్లీ నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) లోడుతో వస్తోన్న లారీ రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కొత్తూరు మండలం చేగూరు చౌరస్తా వద్ద బీభత్సం సృష్టించింది. డ్రైవర్ షేక్ మహ్మద్ మద్యం మత్తులో వాహనం నడపగా ఒక్కసారిగా అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్, ఓ టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తోన్న ఏడాది చిన్నారి సహా తల్లి మృతి చెందగా.. మరో చిన్నారి సహా తండ్రికి గాయాలయ్యాయి. మృతులు షాద్ నగర్ పట్టణానికి చెందిన కావ్య (22), అనన్య (1)గా గుర్తించారు. ఆటోలో ప్రయాణిస్తోన్న ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Money Scam: నగరంలో రూ.175 కోట్ల కుంభకోణం - పేదల పేరుతో ఖాతాలు తెరిచి భారీ మోసం