Mukhesh Ambani : ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. సరిగ్గా వారం రోజుల ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు పతనం కావడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.75 వేల కోట్లు తగ్గింది. మరోవైపు, ఎల్ఐసీ, ఎస్ బీఐ మార్కెట్ క్యాప్లో కూడా పెద్ద క్షీణత కనిపించింది. దేశంలో రెండవ అతి పెద్ద రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది. అయితే, గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు తగ్గింది.
మరోవైపు, దేశంలోని టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.58,554.88 కోట్ల మేర పెరిగింది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్లో అతిపెద్ద పెరుగుదల కనిపించింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఐటీ, హెచ్యూఎల్ మార్కెట్ క్యాప్ పెరిగింది. గత వారం, బిఎస్ఇ సెన్సెక్స్ 428.87 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు లేదా 0.47 శాతం పడిపోయింది.
దేశంలోని ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గుదల
దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. అలాగే దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LICI) విలువ రూ.21,251.99 కోట్లు తగ్గి రూ.5,19,472.06 కోట్లకు చేరుకుంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ.17,626.13 కోట్లు తగ్గి రూ.6,64,304.09 కోట్లకు చేరుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.11,549.98 కోట్లు తగ్గి రూ.8,53,945.19 కోట్లకు చేరుకుంది.
ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరుగుదల
మరోవైపు, దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,934.38 కోట్లు పెరిగి రూ.7,78,612.76 కోట్లకు చేరుకుంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రూ.9,828.08 కోట్లు పెరిగి, దాని విలువ రూ.12,61,627.89 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మార్కెట్ విలువ రూ.9,398.89 కోట్లు పెరిగి రూ.9,36,413.86 కోట్లకు చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వాల్యుయేషన్ రూ.9,262.3 కోట్లు పెరిగి రూ.15,01,976.67 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతిపెద్ద FMCG కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ రూ.3,442.15 కోట్లు పెరిగి రూ.5,56,594.67 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతిపెద్ద FMCG కంపెనీలలో ఒకటైన ఐటీసీ విలువ రూ.1,689.08 కోట్లు పెరిగి రూ.5,52,392.01 కోట్లకు చేరుకుంది.