Petrol Price Today 24th April 2022: దేశ వ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ప్రత్యక్షంగా వాహనదారుల జేబులు గుల్లవుతుంటే, వీటి ప్రభావం పరోక్షంగా అన్ని రంగాల వారిపై పడుతోంది. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 24th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) తగ్గింది. 18 పైసలు తగ్గడంతో వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌‌పై 17 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.02 గా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.18 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.105.20 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.67 కాగా, డీజిల్ ధర రూ.105.64 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 40 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.63 కాగా, డీజిల్‌‌పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.48కి చేరింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 24th April 2022) లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ లీటర్ ధర రూ.106.80 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 83 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ పై 50 పైసలు పెరగడంతో లీటర్ రూ.121.88 కాగా, డీజిల్‌పై 44 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.39 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. 


Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్, బంగారం ధరలకు బ్రేక్, రూ.4000 తగ్గిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ


Also Read: Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు, అగ్నిగోళంలా మారుతున్న రాయలసీమ - తెలంగాణలోనూ భానుడి ప్రతాపం