Petrol Price Today 16th April 2022 : గత రెండు వారాల నుంచి ఇంధన ధరలు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. దాంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 16th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా  ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) దిగొచ్చింది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌‌పై 42 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.02 గా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.21 కాగా, డీజిల్‌‌‌పై 13 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.23 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 15 పైసలు పెరిగి, పెట్రోల్ లీటర్ ధర రూ.119.37 కాగా, 13 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.36కు చేరింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.49 కాగా, డీజిల్‌‌పై 17 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.35కి దిగొచ్చింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 16th April 2022) లీటర్ ధర రూ.121.55 కాగా, ఇక్కడ డీజిల్ పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.106.80 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.04 అయింది. డీజిల్‌పై 23 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో ఇంధన ధరలు నేడు పెరిగాయి. 32 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ రూ.122.07 కాగా, 55 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.107.57 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 


Also Read: Gold Rate Today: తగ్గేదేలే - ఏప్రిల్‌లో ఒక్కరోజు కూడా తగ్గని బంగారం, రూ.3000 పెరిగిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ 


Also Read: Weather Updates: బీ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక