Petrol Price Today 11th June 2022:  పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 11th June 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో శనివారం పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.56 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి. 45 పైసలు పెరగడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.84 కాగా, 42 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.98 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 69 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.84 కాగా, డీజిల్‌‌పై 65 పైసలు పెరిగి లీటర్ ధర రూ.99.85 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు..
విజయవాడలో ఇంధన ధరలు పెరిగాయి. 21 పైసలు పెరగడంతో ఇక్కడ పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 11th June 2022) లీటర్ ధర రూ.111.54 కాగా, 19 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.31 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 8 పైసలు పెరగడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.72 అయింది. డీజిల్‌పై 7 పెరగడంతో లీటర్ ధర రూ.98.249 అయింది.
చిత్తూరులో పెట్రోల్ పై రూ.1.54 తగ్గడంతో లీటర్ రూ.111.96 కాగా, డీజిల్‌పై రూ.1.42 తగ్గడంతో లీటర్ ధర రూ.99.64 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ఇటీవల తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.