కొంత కాలంగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరింతగా పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.108.02 అయింది. రూ.100.51 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.100.89కి చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.107.53గా ఉంది. డీజిల్ ధర రూ.0.21 పైసలు పెరిగి రూ.100.43 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.13 పైసలు పెరిగి.. రూ.107.53గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.101.04 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.08 పైసలు తగ్గి రూ.109.71 గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసా పెరిగి రూ.102.46 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త ఎక్కువగానే పెరిగాయి. ప్రస్తుతం రూ.110.31 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.61 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.68 పైసలు పెరిగి రూ.102.61కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.


Also Read: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటు... మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధం...  పవన్ కీలక వ్యాఖ్యలు


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.70గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.77 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.109.70గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.77 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.


తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.43 పైసలు తగ్గి.. రూ.110.24 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.101.98గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.80 పైసలు పెరిగింది.


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 10 నాటి ధరల ప్రకారం 76.38 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి