దేశంలో హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నెల రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటుండగా, డీజిల్ ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపించాయి. తాజాగా రెండింటి ధరలు నిలకడగా ఉన్నాయి. వారం రోజుల క్రితం ఒక్క హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలో స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉండగా.. ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి.


తెలంగాణలో ఆగస్టు 22న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర ఆదివారం స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డీజిల్ ధర లీటరుకు రూ.97.33 కు చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. నిన్నటి ధరతో పోలిస్తే రూ.0.27 పైసలు తగ్గింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.24 పైసలు తగ్గి రూ.97.21 అయింది.


ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.90 గా ఉంది. పెట్రోల్ నిలకడగా ఉండగా.. డీజిల్ రూ.0.80 పైసల చొప్పున పెరిగింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరల్లో తాజాగా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.


నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.31 పైసల చొప్పున తగ్గింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.29 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.44 గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.82గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటూ వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.03 పైసల చొప్పున స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.24 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు పెరిగి రూ.99.22కు చేరింది.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.20గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.0.23 పైసలు పెరిగి రూ.98.20గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం వరకూ రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపించగా.. తాజాగా స్వల్పంగా ఉంటున్నాయి.


తిరుపతిలో స్వల్ప మార్పులు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజుల క్రితం వరకూ పెద్ద మార్పులు చోటు చేసుకోగా.. తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పెట్రోల్ ధరలో లీటరుకు రూ.0.25 పైసలు పెరిగింది. డీజిల్ రూ.0.26 పైసలు పెరిగింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.37గా ఉండగా.. ఇక డీజిల్ ధర రూ.99.31గా ఉంది.


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 21 నాటి ధరల ప్రకారం 63.20 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.