Petrol Diesel Price 21th May 2022 : ఇటీవల క్రమంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న, ఇవాళ(శనివారం) ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉంది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..


ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ స్వల్పంగా పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.121.24 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.85గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.120.26గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.0.26 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.89గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర  రూ.121.81 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.107.27గా ఉంది. 


తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..


హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.105.49గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు (మే 20) పెట్రోల్ ధర రూ.119.18 గా ఉంది. డీజిల్ ధర రూ.105.19 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.119 ఉంది. డీజిల్ ధర రూ.105.02గా ఉంది.  నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు నిలకడగా ఉంది. పెట్రోల్ ధర లీటరుకు రూ.120.94 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.37 పైసలు తగ్గి రూ.106.83 గా ఉంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో 


దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.96.67 ఉంది. కోల్ కతాలో పెట్రలో ధర లీటరుకు రూ.115.12గా ఉంటే ముంబయిలో రూ.120.51గా ఉంది. కోల్ కతాలో డీజిల్ ధర లీటర్ రూ.99.83గా ఉంటే ముంబయిలో రూ.104.77 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85గా ఉంది. డీజిల్ ధర రూ.100.94గా ఉంది.