దేశంలో చెన్నై, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో మూడు రోజుల క్రితం పెరిగిన స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నా, ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి.


తెలంగాణలో ఆగస్టు 18న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర కూడా రూ.97.96 గా స్థిరంగానే ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.41 పైసలు పెరిగింది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.106.12గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.39 పైసలు పెరిగి రూ.98.22 అయింది.


ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.55 కాగా.. డీజిల్ ధర రూ.97.68 గా ఉంది. పెట్రోల్ రూ.0.17 పైసలు పెరగ్గా.. డీజిల్ రూ.0.51 పైసల చొప్పున పెరిగింది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.


నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.45 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.42 పైసలు పెరిగింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.59 గా ఉంది. డీజిల్ ధర రూ.99.59గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.06 చొప్పున స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.22 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు తగ్గి రూ.99.77కు చేరింది.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.89గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.86 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.80 పైసలు తగ్గి రూ.98.51గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.


Also Read: Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!


తిరుపతిలో భారీ మార్పు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజులుగా భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. కానీ, తాజాగా స్వల్పంగా ధరలు తగ్గాయి. పెట్రోల్ లీటరుకు రూ.0.38 పెరగ్గా.. డీజిల్ రూ.0.34 పెరిగింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.84కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.100.31గా ఉంది.


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 18 నాటి ధరల ప్రకారం 66.49 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.


Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి


Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..