search
×

Alert: మీకు పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై ఖాతా ఉందా?, జరిమానా తప్పించుకోవడానికి ఇంకొన్ని రోజులే గడువు!

PPF, SSY Account: ఇది మిస్ అయితే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

Minimum Deposit For PPF, SSY Account: మనలో చాలా మందికి చిన్న మొత్తాల పొదుపు ఖాతా (Small Savings Scheme) ఉంటుంది. నెలకోసారి, లేదా నిర్ధిష్ట సమయంలో ఆ ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మీకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాలు ఉంటే, మీ కోసం కీలక అప్‌డేట్‌. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఇంకా ఈ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయకపోయినా/ మర్చిపోయినా మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. జరిమానా నుంచి తప్పించుకోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. కచ్చితంగా చెప్పాలంటే, ఈ నెలాఖరు (31 మార్చి 2024) వరకే గడువుంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. ఈ నెల ముగియడానికి ఇంకొన్ని రోజుల సమయమే మిగిలివుంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది కాబట్టి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సుకన్య సమృద్ధి యోజన వంటి ఖాతాల్లో కనీస డిపాజిట్ (Minimum Deposit) చేయాలి. ఇది మిస్ అయితే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, పన్ను ఆదాను ప్రయోజనాన్ని (Income tax saving Benift) కూడా కోల్పోతారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ 
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం, PPF ఖాతాదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరం తన ఖాతాలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఆ ఖాతాను నిలిపేస్తారు. ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా మారితే, రుణం (Loan) & పాక్షిక ఉపసంహరణ (Partial withdrawal) సౌకర్యాలు రద్దవుతాయి. అలాంటి ఖాతాను పూర్తిగా క్లోజ్‌ చేయకుండా మీరు మీ పేరు మీద మరో అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు. ఈ ఇబ్బందులు వద్దు అనుకుంటే.. ఇన్‌-యాక్టివ్‌గా మోడ్‌లో ఉన్న PPF ఖాతాను తిరిగి క్రియాశీలం (Activate) చేసుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. జరిమానాతో పాటు, వార్షిక కనీస డిపాజిట్‌ రూ. 500 కూడా డిపాజిట్ చేయాలి. అంటే.. పీపీఎఫ్‌ ఖాతాను తిరిగి పని చేయించడానికి, ఆ అకౌంట్‌ ఎన్నేళ్లు నిద్రాణ స్థితిలో ఉంటే అన్ని 550 రూపాయలు (రూ.50 + రూ.500) చెల్లించాలి.

సుకన్య సమృద్ధి యోజన 
సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీకు ఉంటే, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే, డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి క్రియాశీలం చేయాలంటే ఏడాదికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. దీంతోపాటు ఏడాదికి కనీసం రూ. 250 చొప్పున డిపాజిట్ చేయాలి. SSY అకౌంట్‌ ఎన్ని సంవత్సరాలు డిఫాల్ట్‌ అయితే, అన్ని 300 రూపాయలు (రూ.50 + రూ.250) కట్టాలి.

పన్ను ఆదా ప్రయోజనం 
మీరు పన్ను చెల్లింపుదారు (Taxpayer) అయితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో జమ చేసిన పెట్టుబడికి ఆదాయ పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, PPF, SSY ఖాతాల్లో పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31 లోపు కనీస మొత్తం చెల్లించాలి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Published at : 25 Mar 2024 09:31 AM (IST) Tags: NPS penalty PPF SSY Investment

ఇవి కూడా చూడండి

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం