Petrol Price Today 24th  August 2022: హైదరాబాద్‌లో దాదాపు మూడు నెలల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆగస్టు 24 (బుధవారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 24th August 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 


తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర (Petrol Price In Warangal) రూ.109.10 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.29గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ పై 17పైసలు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.109.14 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.32 వద్ద నిలకడగా ఉంది. 
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) మళ్లీ తగ్గాయి. 15పైసలు తగ్గడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.32 కాగా, డీజిల్ ధర 13పైసలు తగ్గింది. కరీంనగర్‌లో డీజిల్‌ ధర రూ.97.50గా ఉంది. నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 15పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.32 కాగా, డీజిల్‌‌ లీటర్‌పై 13పైసలు తగ్గింది. ప్రస్తుత ధర రూ.97.50 వద్ద కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధరపై 43 పైసలు పెరగడంతో  రూ.109.90కాగా, డీజిల్ లీటర్ ధరపై కూడా 41పైసలు పెరగడంతో అక్కడ డీజిల్‌ ధర రూ.98.04 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధరపై 16పైసలు తగ్గడంతో రూ.109.41 కాగా, డీజిల్ లీటర్ ధర కూడా 15పైసలు తగ్గి... రూ.97.57వద్దకు చేరింది. 


ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరల్లో మార్పులు భారీగా వచ్చాయి. పెట్రోల్‌ (Petrol Price Today In Vijayawada) లీటర్ ధర రూ.112.43కు పెరిగింది. 83 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.100.13 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 80పైసలు పెరిగి... రూ.111.28 అయింది. 74 పైసలు పెరిగి డీజిల్‌ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో పెట్రోల్ లీటర్ 37పైసలు తగ్గి రూ.111.98 కాగా, 32పైసలు తగ్గి డీజిల్ లీటర్ ధర రూ.99.69 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 37 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.90 కాగా, డీజిల్ ధర 32 పైసలు తగ్గి రూ. 99.64 అయింది. నెల్లూరులో 65పైసలు పెరగడంతో  పెట్రోల్ ధర రూ.111.81కు చేరింది. 61 పైసలు పెరగడం డీజిల్ ధర రూ.99.51 అయింది. 


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్‌ 112.43రూపాయలుగా ఉంది. డీజిల్‌ 100.13రూపాయలుగా ఉంది. డీజిల్ తక్కువ ధర 98.27తో విజయనగరం ఉంది. పెట్రోల్‌ కూడా 110.85రూపాయలతో అక్కడే తక్కువ ఉంది.


తెలంగాణలో వ్యాప్తంగా ధరలు చూస్తే పెట్రోల్‌ ఎక్కువ ధర ఆదిలాబాద్‌లో 111.90 రూపాయలుగా, డీజిల్‌ ధర 99.90గా ఉంది. వరంగరల్‌ రూరల్‌లో తక్కువ పెట్రోల్‌ ధర 109.14, డీజిల్‌ ధర 97.32 ఉంది. 


ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.