అన్వేషించండి

Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!

Silver Price Growth 2000-2025: వెండి మార్కెట్ ప్రస్థానం మొదట్లో శాంతంగా, నెమ్మదిగా సాగిన ఈ ప్రవాహం మధ్యలో ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ, ఇప్పుడు అత్యంత వేగంతో దూసుకుపోతోంది.

భారతీయ మార్కెట్‌లో బంగారం తర్వాత ఆ స్థాయిలో ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న లోహం వెండి. గత పాతికేళ్లలో భారత వెండి మార్కెట్ ప్రయాణాన్ని గమనిస్తే, ప్రారంభంలో తడబాటు, మధ్యలో ఒడిదుడుకులు, చివరలో అనూహ్యమైన వేగంతో దూసుకుపోయింది. 2000వ సంవత్సరంలో కేవలం రూ.7,900గా ఉన్న కిలో వెండి ధర, నేడు 2025 డిసెంబర్ నాటికి ఏకంగా రూ.2,40,000కు చేరుకోవడం ఒక సంచలనం. ఈ 25 ఏళ్ల కాలంలో వెండి ఏకంగా 2,600 శాతం పెరుగుదలను నమోదు చేసి, ఇన్వెస్టర్ల పాలిట కాసుల వర్షం కురిపించింది. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, నేడు పారిశ్రామిక అవసరాలకు వెన్నెముకగా ఎలా మారిందో తెలిపే సమగ్ర కథనం ఇది.

తొలి అడుగులు: సంప్రదాయం చాటున వెండి (2000 - 2004)

2000వ సంవత్సరంలో భారత వెండి మార్కెట్ అత్యంత సంప్రదాయబద్ధంగా ఉండేది. అప్పట్లో వెండిని కేవలం ఆభరణాలు, పట్టీలు లేదా పూజా సామాగ్రి కోసమే కొనేవారు. అప్పట్లో కిలో వెండి ధర రూ.7,900 మాత్రమే. దేశవ్యాప్తంగా డిమాండ్ కూడా ఏడాదికి 600 టన్నుల లోపే ఉండేది. ఆ రోజుల్లో వెండి కొనుగోలు అంటే నేరుగా షాపుకు వెళ్లాల్సిందే తప్ప, నేటిలా డిజిటల్ ఆప్షన్లు ఉండేవి కావు.

2000 నుంచి 2004 మధ్య కాలంలో మార్కెట్ స్థిరంగా కొనసాగింది. 2001లో ధర రూ.7,500 నుంచి రూ.8,000 మధ్య ఊగిసలాడింది. 2002లో ధర రూ.8,000కు చేరగా, మెల్లగా పారిశ్రామిక అవసరాల కోసం వెండిని వాడటం ప్రారంభమైంది. 2003 నాటికి ప్రజలు వెండిని ఒక సేవింగ్స్ మార్గంగా చూడటం మొదలుపెట్టారు, ఫలితంగా ధర రూ.8,500కు పెరిగింది. 2004 నాటికి మార్కెట్ విస్తరిస్తూ ధర రూ.9,000 మార్కును దాటింది.

మధ్యంతర దశ: ప్రపంచ సంక్షోభం, ఆశ్చర్యకరమైన మలుపులు (2005 - 2014)

ఈ పదేళ్ల కాలం వెండి చరిత్రలో అత్యంత కీలకమైనది. 2005లో ధర రూ.10,000 మార్కును దాటగా, అంతర్జాతీయ డిమాండ్ ప్రభావం మన మార్కెట్‌పై పడటం మొదలైంది. 2006లో ఇండస్ట్రియల్ వినియోగం పెరగడంతో ధర రూ.15,000కు, 2007లో రూ.18,000కు చేరింది.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా వెండిని ఎంచుకున్నారు, అప్పట్లో ధర రూ.20,000 దాటింది. 2011లో వెండి తన మొదటి  పీక్ స్టేజిని చూసింది, కిలో ధర ఏకంగా రూ.57,000కు చేరుకోవడం అప్పట్లో ఒక పెద్ద వార్త. అయితే, ఆ తర్వాతి మూడేళ్లు ధర కొంత కరెక్షన్‌కు గురై 2014 నాటికి రూ.45,000 వద్ద స్థిరపడింది.

సరికొత్త రికార్డులు (2015 - 2025)

2015 నుంచి వెండి రూపం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రభావం వెండిపై కూడా కనిపించింది. 2015లో ధర రూ.37,000 - రూ.40,000 మధ్య ఉండగా, 2017 నాటికి రూ.45,000కు చేరింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో అనిశ్చితి నెలకొనడంతో, వెండి ధర మళ్లీ పుంజుకుని రూ.60,000 - రూ.70,000 స్థాయికి చేరింది.

అయితే, అసలైన విప్లవం గత రెండేళ్లలో వచ్చింది. 2024లో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరగడంతో ధర రూ.1,00,000 మార్కును తాకింది. ఈ డిమాండ్ కొనసాగుతూ 2025 డిసెంబర్ నాటికి వెండి ధర రూ.2,40,000కు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది.

వెండి ధర పెరగడానికి కారణమేమిటి 

ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, సంప్రదాయ ఆభరణాల డిమాండ్. రెండు, ఆధునిక పారిశ్రామిక అవసరాలు. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ వెండి ధరలను ఆకాశానికి చేర్చింది. గతంలో లాగా కేవలం ఫిజికల్‌ వెండి మాత్రమే కాకుండా, ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు తమ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వెండిని కొలెటరల్ గా, అంటే రుణాలు పొందేందుకు హామీగా అనుమతించాలని నిర్ణయించింది. 2026 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుండటంతో మార్కెట్ మరింత బలోపేతం కానుంది.

లాభాల పంట.. సామాన్యుడి ఆవేదన

వెండి ధరల పెరుగుదల సమాజంలో భిన్నమైన ప్రభావాలను చూపింది. 2000వ సంవత్సరంలో వెండి కొన్నవారు నేడు 30 రెట్ల లాభాన్ని చూస్తున్నారు, ఇది వారి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరిచింది. మరోవైపు, కోవిడ్,  ప్రపంచ సంక్షోభ సమయాల్లో ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఆభరణాలు కొనలేక ఇబ్బందులు పడ్డారు. అయితే, పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్ల ఈ రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించాయి.  

సవాళ్లు  సాధనలు

ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, వెండి ధరల వృద్ధికి కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, వాస్తవ పారిశ్రామిక అవసరాలే కారణం. ఇటిఎఫ్ లు రావడం వల్ల పెట్టుబడి ప్రక్రియ సులభతరం అయిందని వారు భావిస్తున్నారు. పాలసీ నిపుణులు ప్రభుత్వం తీసుకున్న కొలెటరల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, ప్రపంచ మార్కెట్లో సప్లై షార్టేజ్, అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గులు భవిష్యత్తులో ప్రధాన సవాళ్లుగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సరికొత్త దిశలో వెండి ప్రస్థానం

భారత వెండి మార్కెట్ పాతికేళ్ల ప్రయాణం ఎన్నో పాఠాలను నేర్పింది. 2000లో రూ.7,900 ఉన్న వెండి, 2025లో రూ.2,40,000కు ఎదగడం అనేది ప్రగతికి ప్రతిబింబం. ప్రభుత్వ విధానాలు, డిజిటల్ మార్పులు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలు వెండిని కేవలం ఒక లోహం నుంచి శక్తివంతమైన ఆర్థిక వనరుగా మార్చాయి. భవిష్యత్తులో వెండి మార్కెట్ మరిన్ని అద్భుతాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget