అన్వేషించండి

Jan Dhan Accounts: జన్ ధన్‌! పేరు చెబితేనే బ్యాంకులకు దడా ధన్‌!

Jan Dhan Accounts: ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) మొదలై ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పటికీ తక్కువ ఖర్చుతో ఈ ఖాతాలను నిర్వహించేందుకు బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయి.

Banks struggle to make Jan Dhan accounts cost effective and viable :  ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) మొదలై ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పటికీ తక్కువ ఖర్చుతో ఈ ఖాతాలను నిర్వహించేందుకు బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని తెలిసింది. వ్యాపార దృక్పథంతో చూస్తే వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా మారింది. ఒక్కో జన్‌ ధన్‌ ఖాతా నిర్వహణకు ఏడాదికి రూ.3,200 నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతోంది. వీటి మెయింటెనెన్స్‌కు ఎక్కువగా టెక్నాలజీనే ఉపయోగిస్తున్నా కొత్త ఖాతాలు తెరిచేందుకు సమయం, మానవ వనరులు అవసరమవుతోంది.

ప్రస్తుతం జన్‌ధన్‌ ఖాతాల సగటు డిపాజిట్‌ మొత్తం రూ.3000గా ఉంటోంది. క్రమంగా రూ.5000 లేదా రూ.6000కు పెరుగుతుందని అంచనా. అయితే ఇందుకెంతో సమయం పట్టనుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 454.7 మిలియన్ల జన్‌ధన్‌ ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి. ఇందులో రూ.167,000 కోట్లుకు మించి నగదు నిల్వ ఉంది. ఎక్కువగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనే ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ, ఆరోగ్య బీమా డబ్బులు వేసేందుకు ఇవెంతగానో ఉపయోగపడ్డాయి. రాను రాను సగటు నిల్వ రూ.3,723కు పడిపోతుండటం కలవరపెడుతోంది. 430 మిలియన్లలో ఇప్పుడు 368.6 మిలియన్ల ఖాతాలే యాక్టివ్‌గా ఉన్నాయి.

జన్‌ ధన్‌ ఖాతాల్లోని నగదుపై ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపుగా 4 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. మిగతా వాటిల్లో ఇది  2.75 నుంచి 3.50 శాతమే కావడం గమనార్హం. ఒక్కో జన్ ధన్‌ ఖాతా కేవైసీకి 40 నుంచి 50 శాతం వరకు ఖర్చవుతోందని తెలిసింది. చాలా మంది కస్టమర్లు ఈ ఖాతాల్లో లావాదేవీలే చేపట్టడం లేదు. పేదలకు జీతభత్యాలు నేరుగా నగదు రూపంలోనే ఇవ్వడం, వారు ఖాతాల్లో జమ చేసుకోవడం తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు ఇబ్బంది అవుతోంది. నకిలీ ఖాతాలు ఎక్కువ అవ్వడంతో వాటి కేవైసీ చేపట్టేందుకు భారీగా ఖర్చవుతోంది. మరి ఈ సమస్యల నుంచి బ్యాంకులు ఎలా గట్టెక్కుతాయో చూడాలి!!

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget