search
×

Loan Rate: వడ్డీ రేటు పెరిగింది, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ EMI ఎంత పెరుగుతుందో తెలుసా?

MLCR పెంపు తర్వాత.. హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన రుణాల మీద బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ రేటు పెరిగింది.

FOLLOW US: 
Share:

Axis Bank Loan Rate: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు (RBI Repo Rate) పెరిగినప్పటి నుంచి, అన్ని బ్యాంకులూ రుణ వడ్డీ రేట్లు పెంచే ప్రక్రియ మొదలు పెట్టాయి. ఈ జాబితాలో మరో పెద్ద ప్రైవేట్ బ్యాంక్ పేరు కూడా చేరింది. అది.. యాక్సిస్ బ్యాంక్. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌ను (MCLR) పెంచుతూ ఈ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు ఆదివారం (ఫిబ్రవరి 19, 2023) నుంచి అమలులోకి కూడా వచ్చాయి. ఇప్పుడు, కస్టమర్లపై EMI భారం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంక్ MCLR ఎంత పెరిగింది?
యాక్సిస్ బ్యాంక్, తన MCLR ను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. ఈ పెంపు తర్వాత... 
బ్యాంకు ఓవర్‌నైట్ MCLR (ఒక రోజు రుణం మీద వడ్డీ) 8.60 శాతం నుంచి ఇప్పుడు 8.70 శాతానికి పెరిగింది. 
3 నెలల MCLR 8.70 నుంచి 8.80 శాతానికి పెరిగింది. 6 నెలల MLCR 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది. 
1 సంవత్సరం రుణంపై MCLR 8.80 శాతం నుంచి 8.90 శాతానికి పెరిగింది. 
2 సంవత్సరాల MLCR 8.90 శాతం నుంచి 9.00 శాతానికి పెరిగింది.
3 సంవత్సరాల MLCR 8.95 శాతం నుంచి 9.05 శాతానికి పెరిగింది. 

వినియోగదారులపై ఎంత భారం పడుతుంది?
MLCR పెంపు తర్వాత.. హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన రుణాల మీద బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ రేటు పెరిగింది. ఇదే కోవలో, యాక్సిస్‌ బ్యాంక్‌ రుణగ్రహీతల మీద EMIల భారం పెరుగుతుంది. రుణగ్రహీతలు నెలనెలా కట్టాల్సిన EMI మొత్తం, ఇప్పుడు కడుతున్నదానికి అదనంగా  0.1% పెరుగుతుంది. 

మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌ (MCLR) అంటే, బ్యాంకు తన కస్టమర్లకు అందించే కనీస రుణ రేటు. రిజర్వ్ బ్యాంక్ 2016లో MCLRని ప్రవేశపెట్టింది. ఏదైనా బ్యాంకు MCLRని పెంచితే, ఆటోమేటిక్‌గా ఆయా రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే, జనం జేబుల్లోంచి డబ్బులు తీసుకునే పని, మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.

కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా MCLR పెంచింది
యాక్సిస్ బ్యాంక్ కంటే ముందు, కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా MCLR పెంచింది. ఈ బ్యాంక్, తన MCLR ను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 16, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెరుగుదల తర్వాత, బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.20 శాతానికి, 1 నెల MCLR 8.54 శాతానికి, 3 నెలల MCLR 8.60 శాతానికి, 6 నెలల MCLR 8.80 శాతానికి, 1 సంవత్సరం MCLR 9.00 శాతానికి, 2 సంవత్సరాల MCLR 9.05 శాతానికి, 3 సంవత్సరాల MCLR 9.20 శాతానికి పెరిగింది.

రుణ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంక్ (RBI) నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 8న, రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది, ఇప్పుడు అది 6.50 శాతానికి చేరింది. ఈ పెరుగుదల వల్ల చాలా బ్యాంకులు తమ రుణాలు & FD వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరు కూడా ఇందులో ఉంది. ఎస్‌బీఐ కొత్త రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా రుణ వడ్డీ రేట్లను పెంచాయి.

Published at : 22 Feb 2023 03:28 PM (IST) Tags: Axis Bank Kotak Mahindra Bank Loan Costly Axis Bank MCLR

ఇవి కూడా చూడండి

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం