Stock Market Closing Bell on 25 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీగా నష్టపోయాయి. ఆరంభంలో లాభాల్లోనే కదలాడిన సూచీలు 11 గంటల నుంచి నేల చూపులు చూశాయి. యూఎస్‌ ఫెడ్‌ మినట్స్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌ నుంచి ఎఫ్‌ఐఐలు నిధులు వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. మొత్తంగా మదుపర్లలో మిశ్రమ సెంటిమెంట్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,025 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 303 పాయింట్లు నష్టపోయింది.


BSE Sensex


క్రితం సెషన్లో 54,052 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,254 వద్ద లాభాల్లో మొదలైంది. 53,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు వల్ల 54,379 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 303 పాయింట్ల నష్టంతో 53,749 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 16,125 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16196 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 16,006 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,223 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 99 పాయింట్లు నష్టపోయి 16,025 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,491 వద్ద మొదలైంది. 34,285 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,722 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్ల లాభంతో 34,339 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, భారతీయ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, దివిస్‌ ల్యాబ్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ పతనం అయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, రియాల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ సూచీలు 1-3 శాతం నష్టపోయాయి.