Stock Market Closing Bell 24 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బెంచ్‌ మార్క్‌ సూచీలు ఎగిశాయి. ముఖ్యంగా బ్యాంకు, మెటల్‌ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 142 పాయింట్ల లాభంతో 15,699, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 462 పాయింట్ల లాభంతో 52,727 వద్ద ముగిశాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 52,265  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,654 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,447 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,909 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 462 పాయింట్ల లాభంతో 52,727 వద్ద ముగిసింది. 


NSE Nifty


గురువారం 15,556 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,657 వద్ద ఓపెనైంది. 15,619 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,749 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 142 పాయింట్ల లాభంతో 15,699 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 33,434 వద్ద మొదలైంది. 33,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,721 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 492 పాయింట్ల లాభంతో 33,627 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, హీరోమోటో కార్ప్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ నష్టాల్లో ముగిశాయి. దాదాపుగా అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.