Stock Market Opening Bell 02 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్స్‌ పాజిటివ్‌గా ట్రేడవుతున్నా యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌ పర్సన్‌ చేసిన వ్యాఖ్యలతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 53 పాయింట్ల నష్టంతో 17,488 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 163 పాయింట్ల నష్టంతో 58,602 వద్ద ఉన్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 58,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,969 వద్ద నష్టాల్లో మొదలైంది. 58,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 163 పాయింట్ల నష్టంతో 58,602 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 17,542 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,598 వద్ద ఓపెనైంది. 17,485 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 53 పాయింట్ల నష్టంతో 17,488 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 39,422 వద్ద మొదలైంది. 39,200 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 56 పాయింట్ల నష్టంతో 39,244 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ, ఐచర్‌ మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్కువగా ఎరుపెక్కాయి. ఆటో, మీడియా షేర్లకు గిరాకీ ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.