Stock Market @ 12 PM, 07 August 2023:


భారత స్టాక్‌ మార్కెట్లో సోమవారం మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐలు తిరిగి రావడం, కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 53 పాయింట్లు పెరిగి 19,570 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 187 పాయింట్లు పెరిగి 65,908 వద్ద కొనసాగుతున్నాయి. జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎం అండ్‌ ఎం యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,721 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,811 వద్ద మొదలైంది. 65,748 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,961 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు 187 పాయింట్ల లాభంతో 65,908 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,517 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,576 వద్ద ఓపెనైంది. 19,524 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,585 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 53 పాయింట్లు పెరిగి 19,570 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,993 వద్ద మొదలైంది. 44,773 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,997 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 23 పాయింట్లు పెరిగి 44,903 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, దివిస్‌ ల్యాబ్‌, హిందాల్కో, ఎల్‌టీఐ, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,540 వద్ద ఉంది.


Also Read: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా, అది పూర్తయితేనే టాక్స్‌ బెనిఫిట్స్‌ వర్తిస్తాయని తెలుసా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.