Stock Market Closing 7 July 2023:


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు ఏమీ ఆలోచించకుండా ప్రాఫిట్‌ బుకింగ్‌ చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 165 పాయింట్లు తగ్గి 19,331 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 505 పాయింట్లు తగ్గి 65,280 వద్ద ముగిశాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. డాలర్‌తో పోలిస్తే 23 పైసలు బలహీనపడి 82.74 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,785 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,559 వద్ద మొదలైంది. 65,175 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,898 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 505 పాయింట్ల నష్టంతో 65,280 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 19,497 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,422 వద్ద ఓపెనైంది. 19,422 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 165 పాయింట్ల నష్టంతో 19,331 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,118 వద్ద మొదలైంది. 44,844 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,227 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 414 పాయింట్లు తగ్గి 44,925 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, టైటాన్‌, ఎం అండ్‌ ఎం, ఎస్బీఐ లైఫ్‌, సిప్లా షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు తగ్గాయి. ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎక్కువ క్రాష్‌ అయ్యాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.59,070గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.72,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 తగ్గి రూ.23,240 వద్ద ఉంది. 


Also Read: వెజిటేబుల్‌ పిజ్జా తింటారా! మెనూ నుంచి టమాట తొలగించిన మెక్‌డొనాల్డ్స్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial