Stock Market Closing 3 July 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. మరో కొత్త లైఫ్ టైమ్ హై పాయింట్‌ను టచ్‌ చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్లు పెరిగి తొలిసారి 19,322 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 486 పాయింట్లు పెరిగి 65,205 వద్ద ముగిశాయి. మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు మరో రూ.2 లక్షల కోట్లు ఆర్జించారు.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 64,718 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 64,836 వద్ద మొదలైంది. 64,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,300 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 486 పాయింట్ల లాభంతో 65,205 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,189 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,246 వద్ద ఓపెనైంది. 19,234 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,345 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 133 పాయింట్ల లాభంతో 19,322 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,957 వద్ద మొదలైంది. 44,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,353 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 410 పాయింట్లు పెరిగి 45,158 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, మారుతీ, సిప్లా నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ,  ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.88 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.23,810 వద్ద ఉంది. 


Also Read: యెస్ బ్యాంక్‌ FDలపై మరింత ఆదాయం - వడ్డీ రేట్లు పెంపు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial