Stock Market Closing 20 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు లాభపడ్డాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 17,844 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 311 పాయింట్ల పతనమై 61,691 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలపడి 82.73 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,002 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,112 వద్ద మొదలైంది. 60,607 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 311 పాయింట్ల లాభంతో 61,691 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,965 వద్ద ఓపెనైంది. 17,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,004 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 99 పాయింట్లు తగ్గి 17,844 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా నష్టపోయింది. ఉదయం 41,221 వద్ద మొదలైంది. 40,580 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,292 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 430 పాయింట్లు తగ్గి 40,701 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టపోయాయి. దివీస్‌ ల్యాబ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌,  బ్రిటానియా, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 120 తగ్గి రూ.56,830గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.