Stock Market Closing 15 June 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల లాభాలకు నేడు తెరపడింది. అమెరికా ఫెడ్‌ మరో రెండు సార్లు రెపోరేట్లు పెంచుతుందన్న వార్తలు రావడడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 67 పాయింట్లు తగ్గి 18,688 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 310 పాయింట్లు పతనమై 62,917 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.18 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 63,228 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,153 వద్ద మొదలైంది. 62,871 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 310 పాయింట్ల నష్టంతో 62,917 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 18,755 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,774 వద్ద ఓపెనైంది. 18,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 67 పాయింట్లు తగ్గి 18,688 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ భారీ స్థాయిలో నష్టపోయింది. ఉదయం 44,054 వద్ద మొదలైంది. 43,397 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,077 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 544 పాయింట్లు పతనమై 43,443 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, దివిస్‌ ల్యాబ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,670గా ఉంది. కిలో వెండి రూ.900 తగ్గి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.25,610 వద్ద ఉంది. 


Also Read: గల్ఫ్‌లోని ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్! అక్కడా UPI వచ్చేస్తుందట?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.