భారత మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారం నాడు (ఆగస్టు 22) తగ్గాయి. ఆగస్టు 22న బంగారం ధరలో గ్రాముకు రూ.19 మేర తగ్గింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,210 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,210గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గగా వెండి ధర కూడా అతి స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. గ్రాముకు అర్ధ రూపాయి చొప్పున తగ్గింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.5.30 వరకూ తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,700 వరకూ ధర పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 22న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.10 చొప్పున తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,170 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,150 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.61,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటాయి.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 22న రూ.44,150 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,170గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,600గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,170గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,600 కు తగ్గింది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 22న ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.44,650, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.48,710గా ఉంది. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,210గా ఉంది.


ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 22న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.44 వరకూ పెరిగి తాజా ధర రూ.2,367గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,670 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.