భారత్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఆగస్టు 12న బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అంతకుముందు మూడు రోజులు వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు రెండ్రోజులుగా నిలకడగా ఉంటున్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 12)న రూ.45,280 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.46,280గా నిలకడగానే ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర తగ్గింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండగా వెండి ధర మాత్రం అతి స్వల్పంగా తగ్గింది. కేవలం గ్రాముకు రూ.0.80 పైసలు మాత్రమే తగ్గగా.. కేజీ వెండికి రూ.800 వరకూ వ్యత్యాసం ఏర్పడింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.67,900 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 12న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఏపీ, తెలంగాణలో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో కూడా పసిడి ధర నిలకడగా ఉంది. దీంతో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.47,300 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.43,350 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,900గా పలికింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 12న రూ.43,350 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,300గా ఉంది. విజయవాడలో ఆగస్టు 10, 11 తేదీల ధరలతో పోలిస్తే నేడు కూడా ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.67,900 పలుకుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 12న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,280ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,720 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,690గా ఉంది. చెన్నై ధరలో మాత్రం అతి స్వల్వ తగ్గుదల కనిపించింది.


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 12న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.37 వరకూ పెరిగింది. దీంతో తాజా ధర .. రూ.2,396గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,960 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అలాగే ఉంది. 


అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.