భారత్‌లో గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 11న బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 11)న రూ.45,280 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.46,280గా నిలకడగానే ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే బంగారం ధర బాగా తగ్గింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉండగా వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేవలం గ్రాముకు రూ.0.30 పైసలు మాత్రమే తగ్గగా.. కేజీ వెండికి రూ.300 వరకూ పతనమైంది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.63,300 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 11న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో కూడా పసిడి ధర నిలకడగా ఉంది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,300 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,350 అయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,200గా పలికింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 11న రూ.43,350 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,300గా ఉంది. విజయవాడలో ఆగస్టు 10తో పోలిస్తే ధర నిలకడగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.68,200 పలుకుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 11న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,280ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,730 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉంది. చెన్నై ధరలో మాత్రం అతి స్వల్వ తగ్గుదల కనిపించింది.


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కూడా నిలకడగానే ఉంది. అంతక్రితం గ్రాముకు రూ.10 వరకూ తగ్గి.. రూ.2,320గా ఉన్న ప్లాటినం ధర అలాగే కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,200 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.


అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.