GST evasion:  జీఎస్‌టీని ఎగవేస్తున్న ఏడు కంపెనీల సిండికేట్‌ను సీజీఎస్‌టీ దిల్లీ అధికారులు బయటపెట్టారు. ఈ కంపెనీలు మొత్తంగా రూ.85 కోట్ల జీఎస్‌టీని ఎగవేసినట్టు గుర్తించారు. పన్ను ఎగవేత కోసం వేర్వేరు కంపెనీలు, నకిలీ ఐటీసీ బోగస్‌ ఇన్వాయిసులు, వస్తువులను సరఫరా చేయకుండానే ఈవే బిల్స్‌ సృష్టించిన రాకేశ్‌ కుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది.