Nitin Gadkari on Petrol Diesel Future: భారత్ రవాణా ముఖ చిత్రం వేగంగా మారుతోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ఇంధనాల వైపు దేశాన్ని నడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయంశంగా మారాయి. దీర్ఘ కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు. 

Continues below advertisement

నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో పెట్రోల్ డీజిల్ వాడకం వల్ల ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. మొదటిది పర్యావరణంపై పడుతున్న ప్రభావం, రెండోది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ మారక ద్రవ్యం. ఈ తీవ్రమైన సమస్యలను అధిగమించడానికి బయోఫ్యూయల్స్, సీఎన్జీ, ఎల్‌ఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌ల వంటి స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలవైపు తయారీదారులు మళ్లడం అత్యవసరం అని పేర్కొన్నారు. 

Also Read: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటీ?

గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్‌ ఇప్పటికే పలు ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యంగా హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్‌లను నడుపుతున్నట్టు వెల్లడించారు. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు ఇప్పటికే హైడ్రోజన్ ఇంధన ట్రయల్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాయి. 

Continues below advertisement

భవిష్యత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ఇంజన్

ఇథనాల్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్ తన సొంత వనరుల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం వాహనాలు E20 ఇంధనంతో నడుస్తుండగా భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అభివృద్ధిపై పరిశ్రమ దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు. 

Also Read: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

రవాణా వ్యవస్థలో కేవలం ఇంధన మార్పు మాత్రమే కాకుండా, నాణ్యత, భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బస్‌ల రిజిస్ట్రేన్ ప్రక్రియలో పారదర్శకత కోసం వాహన్ పోర్టల్‌లో ఫిజికల్, వీడియో వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తయారీదారుల స్వీయ ధ్రువీకరణ పద్ధతిని ఇది భర్తీ చేస్తుంది. 

భద్రతపై దృష్టి పెట్లాలని సూచన

తయారీదారులు కేవలం ఖర్చు తగ్గిచండంపైనే కాకుండా, ప్రయాణికుల భద్రత, నాణ్యత, సౌకర్యంపై దృష్టి పెట్టాలని గడ్కరీ పిలుపునిచ్చారు. రాబోయే మూడేళ్లలో సుమారు 1,50,000 ఎలక్ట్రిక్ బస్‌లకుడిమాండ్ ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం మన దేశ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 70వేల బస్‌లుగా మాత్రమే ఉంది. ఈ అంతరాన్ని భర్తీ చేస్తూ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

బస్‌వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్‌ 2026 వేదికగా జరిగిన సమావేశం భారత్ రవాణా రంగం భవిష్యత్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడమే కాకుండా కాలుష్యరహిత నగరాలను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.