విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కారణాలపై ఆరా తీస్తున్నారు.  


ఈ ఫ్యామిలీ గొల్లపూడిలో నివాసం ఉంటుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. తెల్లారేసరికి ముగ్గురు విగతజీవులై పడిఉన్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపూడి వైసిపి పార్టీ కార్యాలయ ప్రాంతంలో నివాసముండే కొత్త మాసు రాజేశ్వరి, నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. 


స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల నుంచి సమచారం సేకరిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఉంటారనే కోణంలో అన్వేషణ చేస్తున్నారు.