Krishna District News: నందమూరి తారక రామారావు మనవడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈరోజు (మే 20న) తన 40వ పుట్టినరోజును తారక్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల కేక్ లు కట్ చేస్తూ, రక్తదానాలు చేస్తూ.. ఇలా తమకు తోచిన విధంగా తారక్ బర్త్ డేను సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 


రెండు మేకపోతులు బలి - పేదలకు అన్నదానం


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తారక్  ఫొటోలతో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ మేకపోతులను బలి ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలోని G3  థియేటర్ లో సింహాద్రి సినిమాని ప్రదర్శించారు. సినిమా రీరిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. తారక్ కటౌట్ కి రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం పేదలకు అన్నదానం నిర్వహించారు. జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్ జెండాలు పట్టుకుని బైక్ లపై నగర పుర వీధుల్లో చెక్కర్లు కొట్టారు.