Vijayawada: విజయవాడలోని బృందావన్‌ కాలనీలో జరిగిన హత్య జిల్లానో షేక్ చేస్తోంది. ప్రేమకు అడ్డుగా ఉన్నాడన యువతి తండ్రిని అత్యంత పాశవికంగా చేసిన హత్య రాజధాని ప్రాంతంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. 


బృందావన్‌ కాలనీ చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ కిరాణాదుకాణం నడుపుతున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు దార్శని. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ ఓ ప్రైవేట్ స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్నాడు. వీళ్లిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది హత్యకు దారి తీసింది. 


నాలుగేళ్ల క్రితం మణికంఠకు, దార్శని ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మణికంఠతో కుమార్తె తిరుగుతుందని తెలుసుకున్న కె.శ్రీరామచంద్రప్రసాద్‌ బాధపడ్డాడు. కుమార్తెను పిలిచి బుద్దిగా చదువుకోవాలని ఇప్పుడున్న ఆకర్ష తర్వాత ఉండదని హితబోధ చేశాడు. 


కుమార్తెకు హితబోధన చేసిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌  మణికంఠను పిలిచి అవే మాటలు చెప్పాడు. తన బిడ్డతో తిరగొద్దని సర్ధి చెప్పాడు. అది జరిగిన తర్వాత దార్శని మణికంఠతో మాట్లాడటం మానేసింది. అయినా మణికంఠ ఆమె వెంట పడటం మానలేదు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. 


మణికంఠ ప్రవర్తనతో విసిగిపోయిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ ఫ్యామిలీ వాళ్ల ఇంట్లో పంచాయితీ పెట్టింది. కొంత మంది పెద్ద మనుషులను తీసుకెళ్లి తన బిడ్డ జోలికి రావద్దని చెప్పాలని మణికంఠ తల్లికి చెప్పారు. అసలు విషయం తెలుసుకున్న ఆ ఫ్యామిలీ షాక్‌కి గురైంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో దీనిపైనే  రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 


దార్శనిని దూరం చేయడంతో శ్రీరామచంద్రప్రసాద్‌పై మణికంఠ కసి పెంచుకున్నాడు. దీనికి తోడు ఇంట్లో విషయం చెప్పి తిట్టించడంతో మరింత కోపం రెట్టింపు అయింది. ఈ గొడవతోనే తన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇక పగతో రగిలిపోయిన మణికంఠ గురువారం కాపు కాసి కె.శ్రీరామచంద్రప్రసాద్‌పై వేటు వేశాడు. 
కిరాణ దుకాణం కట్టేసి తండ్రీ కుమార్తె వస్తున్న టైంలో కాపు కాసి అటాక్ చేశాడు. తన బైక్‌తో వారి బైక్‌ను ఢీ కొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై ఎటాక్ చేశాడు.


చేతిలో ఉన్న కత్తిలో విచక్షరహింతగా నరికాడు. దార్శని ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. చివరకు ఆమెను కూడా చంపుతానని బెదిరించాడు. 
గొడవ సంగతి తెలుసుకొని స్థానికులు రావడంతో మణికంఠ పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కె.శ్రీరామచంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.