చిత్తూరు : జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భద్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి అధికం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు భద్రతపై ఎన్.ఎస్.జీ ప్రత్యేక దృష్టి సారించింది. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్న చంద్రబాబుకి 12+12 భద్రత ఏర్పాటు చేసింది.


చంద్రబాబు రోడ్ షో మార్గంలో భరత్ నివాసం.. 
చంద్రబాబు నేడు పాల్గొనే రోడ్ షో మార్గంలోనే వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇల్లు కూడా ఉంది. దాంతో పోలీసులు, చంద్రబాబు భద్రతా సిబ్బంది ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ భరత్ కూడా తన నివాసంలోనే ఉండటంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనీఖి చేసిన తరువాతే వాహనాలను అనుమతిస్తున్నారు. నిన్న అన్నా క్యాంటీన్ ప్రారంభానికి ముందే వైసీపీ శ్రేణులు అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కుప్పంలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు.. 
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన బుధవారం (ఆగస్టు 25) ప్రారంభం అయింది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో చంద్రబాబు పర్యటించారు. గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లెక్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.







చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణంలో పర్యటన కొనసాగుతోంది. పలుచోట్ల ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటలు, రాళ్ల దాడులకు దారి తీసింది. రెండో రోజు చంద్రబాబు పర్యటనలో‌ భాగంగా గురువారం ఉదయం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించాల్సి ఉండగా, వైసీపి నాయకులు క్యాంటీన్ ధ్వంసం చేసి బందుకు వైసిపి పిలుపు ఇవ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు. 





Also Read: Chandrababu Kuppam Tour: టీడీపీ నేతలపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు