ఓటర్లను భయపెడితేనే ఓట్లు పడతాయా? నెగ్గాలంటే బ్లాక్ మెయిల్ తప్పదా! పార్టీల న్యూ ట్రెండ్ ఇదీ
తాయిలాల ప్రచారం పోయింది... ఉచితాల వర్షం ఆగింది. మద్యం పంచినా... డబ్బులు ఇచ్చినా.. ఓట్ల పడతాయో లేదో అన్న ఆందోళన. ఇక ఇప్పుడు  ఎన్నికల్లో గెలవాలంటే... ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది. ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం... భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వర్క్ అవుట్  అయ్యే ధియరీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుండి.. ప్రాంతీయ పార్టీల వరకు ఇదే  అంశాన్ని తమ ఎన్నికల వ్యూహాంగా  అమలు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రైతులకు కాంగ్రెస్ ఇంత మోసమా? రేవంత్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ - కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరి పంటకు రూ.500 బోనస్ ప్రకటించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు వరి పంట మొత్తానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు కేవలం సన్నాలకే దాన్ని పరిమితం చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నయవంచనకు గురి చేసిందని.. వారికి కౌంట్ డౌన్ రైతుల నుంచే మొదలవుతుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పల్నాడు: మగవాళ్లు ఊరొదిలి ఎందుకు వెళ్లారు? ఆడవారు గుడిలో ఎందుకు దాక్కున్నారు?
పల్నాడులో పోలింగ్ అనంతరం జరిగిన దాడులు రావ్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. మూక దాడులు, వాహనాల దహనం, రాళ్ళ దాడులు నుంచి పెట్రోల్ బాంబు దాడులతో దద్దరిల్లింది పల్నాడు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో కొనసాగుతున్నామా  అన్న సంశయము కలిగించింది. ఈ ప్రతీకార దాడులు చూస్తుంటే పార్టీ నాయకులు ఫ్యాక్షన్ లీడర్లుగా మారారన్న భావన కలగక మానదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కీరవాణి, అందెశ్రీతో రేవంత్ భేటీ - త్వరలో సరికొత్తగా ‘జయజయహే తెలంగాణ’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ..’ పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గానూ సీఎం రేవంత్ వీరితో భేటీ అయ్యారు. త్వరలో వీరి ఆధ్వర్యంలో మరింత నూతనంగా జయజయహే పాట రూపుదిద్దుకోబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరు ఉంది. ఇప్పటికే ఉన్న ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను అందెశ్రీ రచించారు. ఈ పాట చాలా పాపులర్ అయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వారణాశిలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల ప్రచారం - ప్రధానికి రికార్డు మెజార్టీనే లక్ష్యం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాశి నియోజవకర్గంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రచారంలో కీలక  పాత్ర పోషిస్తున్నారు. వారణాశి నియోజకవర్గం అంటే మినీ ఇండియా. అక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కొన్నివేల మంది   ప్రజలు, స్థానికంగా నివాసం ఏర్పరచుకున్న భక్తులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడిపోయారు. వీరంతా అక్కడి ఓటర్లుగా ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి