Sajjala On Tenth Exams : కార్పొరేట్ కాలేజీల గతంలో అక్రమాలకు పాల్పడటం వల్లే ఎక్కువ ఫలితాలు వచ్చినట్లుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్లేషించారు. టెన్త్ ఫలితాలపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. టెన్త్ ఫలితాలపై అందరూ తలకాయ లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్పొరేట్ పాఠశాలలు మాల్ ప్రాక్టిస్, పేపర్ లీక్ వంటి వాటికి పాల్పడటం వల్ల అత్యధిక ఉత్తీర్ణతా రేటు వచ్చిందన్నారు. నారాయణ అంశం బయటపడిన తర్వాత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం వల్లనే ఫలితాలు కరెక్ట్‌గా వచ్చాయన్నారు. 


ఈ సారి కేసీఆర్ పోటీ పార్లమెంట్‌కా ? గజ్వేల్‌కు కొత్త అభ్యర్థి ఖాయమేనా ?


గతంలో అత్యధిక పాస్ కార్పొరేట్ స్కూళ్ల అక్రమాల వల్లేనా ?  



గత ఇరవై ఏళ్లుగా ఏపీలో శాతానికిపైగానా టెన్త్ విద్యార్థులు పాసవుతున్నారు. గత పదేళ్లుగా అది90 శాతం వరకూ ఉంది.  కానీ ఈ ఏడాది 67 శాతానికే పడిపోయింది. ఈ కారణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని...  విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  అయితే ఈ సారి అక్రమాలను అడ్డుకున్నాం కాబట్టే.. పాస్ పర్సంటేజీ తక్కువగా ఉందని అంటున్నారు. 


హత్య చేసిన అనంతబాబునూ అంత సేపు ప్రశ్నించలేదే ? సీఐడీపై టీడీపీ తీవ్ర విమర్శలు !


తెలుగు మీడియం విద్యార్థులే ఈ సారి ఎక్కువగా ఫెయిల్ 


ప్రస్తుత ఫలితాల్లో ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులే బాధితులుగా మిగిలారు. ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక పాస్ పర్సంటేజీ ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో అయితే 90శాతానికిపైనే ఉందని చెబుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో అత్యధిక పాస్ రేటు ఉంది. తెలుగు మీడియంలో సగం మంది కూడా లేరు. అయితే ఇలాంటి స్కూళ్లలో మాత్రం  కోవిడ్ కారణంగా రెండేళ్లు క్లాసులు లేకపోవడంతో పాస్ శాతం తగ్గిందని చెబుతున్నారు. అమ్మఒడికి టెన్త్ ఫలితాలకు సంబంధం లేదని.. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని సజ్జల స్పష్టం చేశారు. 


గెలిపించలేకపోతే రూ. వెయ్యి కోట్లిస్తా ! కేఏ పాల్ ఆఫర్ ఎవరికో తెలుసా ?


ఫెయిలయిన వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న ప్రభుత్వం 


టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల ఏపీలో పలు చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎవరూ ఇబ్బంది పడవద్దని.. వెంటనే సప్లిమెంటరీ నిర్వహించి.. పాసయిన వారిని నేరుగా పాసయినట్లుగానే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతోంది.