Jagan Cases :  జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య  ప్రజా ప్రయోజన వ్యాజ్యం  దాఖలు చేశారు.  సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.   2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో జోగయ్య కోరారు. అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతించేందుకు  తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేఏశారు.  వ్యక్తిగత కేసులపై పిల్ వేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందుంచారు రిజిస్ట్రీ.    అభ్యంతరాలపై వాదనలను  సీజే జస్టిస్ ఉజ్జల్, జస్టిస్ ఎన్.తుకారాం బెంచ్  విన్నది.  వేగంగా విచారణ పీపీని ఆదేశించేలా సీబీఐ డైరెక్టర్ ను కోరారా? అని  హరిరామ జోగయ్య తరపు లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. లేదని చెప్పడంతో  సీబీఐ డైరెక్టర్ ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారన్న హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.  ప్రచార ప్రయోజనాల కోసం పిల్ వేశారా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించడంతో.. తమ వ్యాజ్యానికి విచారణ అర్హత ఉందని..   - రెండు వారాలు గడువిస్తే పిల్ విచారణార్హతపై వాదిస్తామని  జోగయ్య న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను  ధర్మాసనం  జులై 6కి వాయిదా  వేసింది. 


వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ గతంలో ప్రతి శనివారం జరిగేది. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యేవారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ కారణాలు, అధికారిక బాధ్యతల కారణంగా విచారణకు  హాజరు కావడం లేదు. మధ్యలో కోవిడ్ కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత శుక్రవారం కూడా విచారణ జరగడం లేదు.  


 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసును   సిబిఐ చేపట్టింది.  వైెస్ రాజశేఖర్ రెడ్డి  రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి  అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసిది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.  సీబీఐ ఎఫ్ఐఆర్‌లో  రిపోర్టులో 58 కంపెనీలు, 13 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేసి   2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


ఏళ్లు గడుస్తున్న అక్రమాస్తుల కేసులో ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాలేదు. నిందితులు  కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు వేసి విచారణను అడ్డుకుంటున్నారని సీబీఐ పలుమార్లు కోర్టులో వాదించింది.  గతంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలో పూర్తి  కాావాలని సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది ., అయినప్పటికీ కేసుల విచారణ మందుకు సాగకపోవడంతో హరిరామజోగయ్య హైకోర్టును ఆశ్రయించారు.