AP minister Dola veeranjaneya swamy injured | ప్రకాశం: ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృటిలో ముప్పు తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరునాళ్లలో మంత్రి స్వామి వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.మంత్రి స్వామి వైపు ఎద్దులు దూసుకు రావడంతో మంత్రికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఎద్దులను తప్పించదాంతో మంత్రి స్వామి స్వల్పగాయాలతో బయటపడ్డారు.


అసలేం జరిగిందంటే..


జరుగుమిల్లి మండలం పాలేటిపాడులో ఆదివారం జరిగిన పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి హాజరయ్యారు. ప్రదర్శనకు సిద్ధంగా ఉంచిన ఎద్దుల పక్కనే నేతలు మంత్రితో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించగా ఆ సమయంలో పెద్ద శబ్దాలకు ఎద్దులు బెదిరిపోయాయి.  ఈ క్రమంలో ఎద్దులు మంత్రిని గట్టిగా తాకడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చివరి నిమిషంలో ఎద్దులను పక్కకు తప్పించడంతో మంత్రికి ముప్పు తప్పింది.


 అనంతరం తూర్పు నాయుడుపాలెంలోని ఆయన నివాసానికి బాల వీరాంజనేయులును తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.