62 IAS officers transferred in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్‌ల బదిలీపై శనివారం రాత్రి ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ కేడర్ నుంచి ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ తో డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రానికి రప్పించారు. ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ కృష్ణతేజకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌‌గా నియమించింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించిన ప్రభుత్వం, ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఐఏఎస్ అధికారులు - పోస్టింగ్స్

- ఎంవీ శేషగిరి బాబు - స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌- సీహెచ్‌ శ్రీదత్‌ - మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ (మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అడిషనల్ డ్యూటీ) - రేఖారాణి - హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌ - చేవూరి హరికిరణ్‌  - ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ - మల్లికార్జున - బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అడిషనల్ డ్యూటీ)- శ్రీకేష్‌ బాలాజీరావు - ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్‌- ప్రసన్న వెంకటేశ్‌ - సాంఘిక, సంక్షేమశాఖల కార్యదర్శి- జి.సి కిషోర్‌ కుమార్‌ - క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీ- గిరీశ్‌ షా - పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ- కీర్తి చేకూరి - ట్రాన్స్‌ కో జాయింట్‌ ఎండీ - ఎం.వేణుగోపాల్‌రెడ్డి - మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌- నారపురెడ్డి మౌర్య - తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ - నిషాంత్‌ కుమార్‌ - ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌- దినేష్‌ కుమార్‌ - గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌- విజయ సునీత - వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌- రామసుందర్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌- తేజ్‌ భరత్‌  -  కడప మున్సిపల్‌ కమిషనర్‌- సంపత్‌ కుమార్‌ - విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌- ధ్యానచంద్ర - విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌- కేతన్‌ గార్గ్‌ -  రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌- అమిలినేని భార్గవతేజ - గుంటూరు జిల్లా జేసీ- హిమాన్షు కోహ్లీ -  తూర్పుగోదావరి జేసీ- నిశాంతి  - కోనసీమ జిల్లా జేసీ- సూరజ్‌ ధనుంజయ్‌ - పల్నాడు జేసీ- గోవిందరావు  - కాకినాడ జేసీ   - వీరపాండ్యన్‌ - సెర్ప్‌ సీఈవో- రవి సుభాష్‌ - ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీ- కృతికా శుక్లా - ఇంటర్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌- లక్ష్మీ షా - ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ CEOగా అడిషనల్ డ్యూటీ)- మంజీర్‌ జిలానీ - ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ (శాప్‌ ఎండీగా అడిషనల్ డ్యూటీ)- ఎం కృష్ణతేజ - పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌- సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌ - సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్లు- ఎం. హరినారాయణ - మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌- ఆదర్శ్‌ రాజేంద్రన్‌ - అన్నమయ్య జిల్లా జేసీ- ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ - శ్రీకాకుళం జేసీ- పి ధాత్రిరెడ్డి - ఏలూరు జేసీ- అభిషేక్‌ గౌడ - అల్లూరి జిల్లా జేసీ- అదితి సింగ్‌ - కడప జేసీ- నూరుల్‌ కమల్‌ - ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ- నిది మీనా - ఎన్టీఆర్‌ జిల్లా జేసీ- విష్ణు చరణ్‌ - నంద్యాల జేసీ- శుభం భన్సాల్‌ - తిరుపతి జేసీ

Also Read: ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్