Renu Desai Post Viral About FundRaising: రేణుదేశాయ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగులో సినిమాల్లో న‌టించారు. 'బ‌ద్రి' తదిత‌ర సినిమాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. త‌న‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను పోస్ట్ చేస్తుంటారు. పిల్ల‌ల‌కు సంబంధించి అప్ డేట్స్ ఇస్తుంటారు రేణు. అంతేకాదు ఆమె పెట్ ల‌వ‌ర్ కూడా. కుక్క‌లు, పిల్లులకు సంబంధించి పోస్ట్ పెడుతుంటారు ఆమె. ఈ నేప‌థ్యంలో ఆమె పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది.


సాయం అడుగుతూ.. 


రేణు దేశాయ్ పెట్ ల‌వ‌ర్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు వీధి కుక్క‌ల‌ను ద‌త్త‌త తీసుకునే పోస్ట్ లు, వాటి వైద్యానికి సాయం చేయ‌మ‌ని, ఫుడ్ డొనేట్ చేయండి అంటూ పోస్ట్ లు పెడుతుంటారు. దాంట్లో భాగంగానే రేణు దేశాయ్ ఒక స్టోరీ పెట్టారు. నాలుగు కుక్క‌పిల్ల‌కి స‌ర్జ‌రీ చేయించాల‌ని, దానికి డ‌బ్బులు కావాలి, నేను కొంత సాయం చేశాను. మీ సాయం కూడా క‌చ్చితంగా అవ‌స‌రం అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. 






మిలియ‌న్ మందిలో 11 మంది.. 


అయితే, ఆ పోస్ట్‌కు కేవ‌లం 11 మంది మాత్ర‌మే స్పందించార‌ట‌. దీనిపై సీరియస్ అవుతూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతుంది. ‘‘మిలియ‌న్ మంది ఉన్నారు. దాంట్లో కేవ‌లం 11 మంది మాత్ర‌మే స్పందిస్తారు అని అనుకోలేదు. చాలామందికి పెట్స్ అంటే ఇష్టం ఉంటుంద‌ని, వాళ్లంతా స్పందిస్తార‌ని అనుకున్నా. ఇంత త‌క్కువ మంది సాయం చేస్తార‌ని ఊహించ‌లేద‌ు’’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రేణు దేశాయ్. 


గ‌తంలో కూడ పోస్ట్.. 


రేణు దేశాయ్ ఎప్ప‌టిక‌ప్పుడు పెట్స్ కి సంబంధించి పోస్ట్ లు పెడుతుంటారు. దాంట్లో భాగంగా గ‌తంలో ఆమె ఒక బ్యాంక్ అకౌంట్, స్కాన‌ర్ ని పోస్ట్ చేసి డ‌బ్బులు సాయం అడిగారు. అయితే, అంద‌రూ ఆ టైంలో రేణు అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని అనుకున్నారు. కానీ, తానే అలా పెట్టాన‌ని, త‌ను పెట్స్ కి సాయం చేయ‌డం కోసం తీసిపెట్టిన డ‌బ్బుల లిమిట్ మించిపోయింద‌ని అందుకే అలా పెట్టాల్సి వ‌చ్చిందంటూ క్లారిటీ ఇచ్చారు రేణు. 


కామెంట్స్‌కు గ‌ట్టి రిప్లై.. 


ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.. కామెంట్స్ కి మాత్రం గ‌ట్టి రిప్లై ఇస్తుంటారు. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టిన కొంత‌మంది చాలా దారుణంగా కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కి ఆమె చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంటారు. వాటికి ధీటుగా రిప్లై ఇస్తుంటారు. ముఖ్యంగా ఏపీ ఎన్నిక‌ల టైంలో ఆమె ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు. అకీరా, ఆద్య‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సంబంధించి పోస్ట్ ల‌కి ఆమె దారుణ‌మైన కామెంట్స్ ని ఎదుర్కున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న‌విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెని ఇప్ప‌టికీ వ‌దినా అంటూ పిలుచుకుంటారు. కానీ, కొంత‌మంది ఫ్యాన్స్ మాత్రం దారుణంగా కామెంట్లు పెడుతుంటారు. 


Also Read: అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోడానికి నిరాకరించిన నయనతార, ఆమె ఎందుకు అలా చేసింది?