57 IAS officers transfers In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఒకేసారి 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు సైతం కొత్త కలెక్టర్లను నియమించింది సర్కార్. జిల్లాలకు కొత్త కలెక్టర్లతో పాటు మిగతా ఐఏఎస్ ల బదిలీ చేస్తున్నట్లు గురువారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం హరి నారాయణ, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్, బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష, సత్య సాయి కలెక్టర్ గా పి అరుణ్ బాబులను నియమించారు. సీఎం సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్ నియమితులయ్యారు.


ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా హర్షవర్ధన్, ఐటీ శాఖ కార్యదర్శిగా కోన శశిధర్, జెన్ కో ఎండీగా చక్రధర్ బాబు, పురపాలక డైరెక్టర్ గా కోటేశ్వరరావు, కార్మికశాఖ కమిషనర్ గా శేషగిరిబాబు, కార్మికశాఖ కార్యదర్శిగా హరిజవహర్ లాల్, పంచాయతీరాజ్ కమిషనర్ గా సూర్యకుమారి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా కె.విజయ, మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఎం విజయసునీత, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె వెంకటమురళి, జీవీఎంసీ కమిషనర్ గా సీఎం సైకత్ వర్మ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా ఎస్ వెంకటేశ్వర్లు, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా వినోద్, ఏపీ హెచ్.ఆర్.డి డీజీగా ఆర్పీ సిసోడియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీధర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా సౌరభ్ గౌర్, శాప్ ఎండీగా హర్షవర్ధన్, మైనార్టీ సెల్ స్పెషల్ సీఎస్ గా జి.అనంతరాము


- చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్
- బాపట్ల కలెక్టర్ గా రంజిత్ భాష
- సత్య సాయి కలెక్టర్ గా పి అరుణ్ బాబు
- అనంతపురం కలెక్టర్ గా పి గౌతమి
- విజయనగరం కలెక్టర్ గా నాగలక్ష్మి
- కృష్ణా జిల్లా కలెక్టర్ గా రాజబాబు
- కర్నూల్ జిల్లా కలెక్టర్ గా సృజన 
- వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్ 
- నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం హరి నారాయణ