MLC Anantababu Case :  దళితుడు అయిన  మాజీ డ్రైవర్ ను చంపి, డోర్ డెలివరీ చేసిన కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టు వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది.  అనంత్‌బాబు కేసును సీబీఐకి అప్పగించాలని కో  హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున వాదనలు వినిపించిన  లాయర్ జడ శ్రవణ్ కుమార్ పోలీసులు అసలు దర్యాప్తు జరపలేదని ఆధారాలను తుడి చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీసీ పుటేజీ వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజ్‌లో ఉన్నవారిని ఎందుకు కేసులో చేర్చలేదని హైకోర్టు ప్రభుత్వం తరపున్యాయవాదిని ప్రశ్నించారు.  కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని..  సహ నిందితుల్ని వదిలేశారని ఆరోపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా  కేసు వివరాలు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు   ప్రభుత్వం సమర్పించింది. 


ఈ పిటిషన్‌పై విచారణలో  హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులకు అనుగుణంగా అనుబంధ చార్జ్‌షీట్ లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని అతని తల్లిదండ్రులు వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌ తెచ్చారు. సింగిల్ జడ్జ్ ఆదేశించినా సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నవారు ఎవరో పోలీసులు కనుక్కోకపోవడంపై అభ్యంతరం హైకోర్టు అభ్యంతరం తెలిపింది. హత్యలో వారి పాత్ర లేదని ఎలా నిర్దారణకు వచ్చారు..? అని ధర్మాసనం ప్రశ్నించింది. వివరాలను అదనపు చార్జ్‌షీట్‌లో ఎందుకు పేర్కొనలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాజాగా విచారణలో పిటిషనర్ల తరపు లాయర్ అవే అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 


మరో వైపు అనంతబాబు తరపులాయర్  ఈ కేసును సీబీఐకి ఇవ్వవొద్దని వాదించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వాదనలు వినేందుకు హైకోర్ట ధర్మాసనం అంగీకరించలేదు. తీర్పును రిజర్వ్ చేసింది.  మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం  బెయిల్ మీద ఉన్నారు.   సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  అనంతబాబును అరెస్టు చేసి.. 90 రోజులు దాటి పోయిందని పోలీసులు దర్యాప్తు చేయడం లేదని అందుకే   బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఏవో కారణాలు చెప్పి.. ఛార్జిషీట్ దాఖలు చేయడం బెయిల్ ఇవ్వాలని కోరడంతో  ..  అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది.  పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు  చేయడం లేదని.. అనంతబాబు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 


అనంతబాబు ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఈ హత్య సంచలనం సృష్టించింది.   నిందితుడ్ని కాపాడేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో అనంతబాబు తాను హత్య చేసినట్లుగా అంగీకరించారు. కానీ ఆయన ఒక్కరే కాదని.. వెనుక ఇంకా చాలా  మంది ఉన్నరన్న ఆరోపణల ప్రకారం పోలీసులు  లోతైన దర్యాప్తు చేయలేదు.