ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,659 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 174 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ మరణాలు ఇవాళ నమోదు కాలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,426కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 301 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,54,553 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,265 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244కి చేరింది. గడిచిన 24 గంటల్లో 301 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,426కు చేరింది. 


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


దేశంలో కరోనా కేసులు


దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదుకాగా 313 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,714 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.







  • మొత్తం కేసులు: 3,45,10,413

  • మొత్తం మరణాలు: 4,65,662

  • యాక్టివ్​ కేసులు: 1,22,714

  • కోలుకున్నవారు: 3,39,22,037


కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,39,09,708కి పెరిగింది. మరణాల సంఖ్య 4,65,662కు చేరింది. మరణాల శాతం 1.35గా ఉంది. రికవరీ రేటు 98.29%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.  గత 44 రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు 20 వేల కంటే తక్కువగా నమోదువుతున్నాయి. గత 147 రోజులుగా 50 వేల కంటే తక్కువగా ఉన్నాయి. 


Also Read: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి