Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13,460 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 122 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 236 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,301,904 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1543 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,176కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,31,39,649 నిర్థారణ పరీక్షలు చేశారు. 










దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 6,561 కరోనా​ కేసులు వెలుగుచూశాయి. గడచిన 24 గంటల్లో 14,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కోవిడ్ తో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇంకా యాక్టివ్​ కేసుల సంఖ్య 77,152గా ఉంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతోంది. నిన్న మరో 21,83,976 డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,02,63,222కు చేరింది.



  • మొత్తం కేసులు: 42,938,599

  • మొత్తం మరణాలు: 5,14,388

  • యాక్టివ్​ కేసులు: 77,152

  • కోలుకున్నవారు: 4,23,53,620


ప్రపంచ వ్యాప్తంగా 


ప్రపంచంలో కొత్తగా15,78,230 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,402,74,905కి చేరింది. తాజాగా 7,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,992,271కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 19,07,368 మంది కోలుకున్నారు. 


Also Read: Work From Office: ఆఫీస్‌లో 100% పని ఇక చరిత్రే! హైబ్రీడ్‌ మోడల్‌కే కంపెనీల ఓటు!