AP Minister Ushasri Charan Hot Comments : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ (Ushasri Charan)సంచలన ప్రకటన చేశారు, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ (Penukonda)నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయన్న ఆమె, ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఆదేశాలతోనే పెనుకొండ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.


కల్యాణదుర్గం అసెంబ్లీ సీటును బోయలకు కేటాయించాలని పార్టీ నిర్ణయించిందన్న ఆమె, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం ఆదరించిన కల్యాణదుర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని,  కృతజ్ఞతతో ఉంటానన్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే మార్పు జరిగిందన్నా ఉషశ్రీ చరణ్.  ఎక్కడికి వెళ్లినా తనది ఒకటే నినాదమని, అదే జగన్ నినాదమని స్పష్టం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్, ఫ్యాన్ ను గుర్తునే చూస్తున్నారని వెల్లడించారు.